మామిళ్లగూడెం, మే 2 : పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు చేపడుతున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ బృందాలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఓటింగ్కు ముందే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 85 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులు ఎవరైతే పోలింగ్ కేంద్రానికి రాలేక పోతున్నారో వారి వద్దకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హకు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఎస్సెన్షియల్ సర్వీసెస్ ఎఫ్సీఐ, ఇండియన్ రైల్వే, ఫైర్, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ, పౌరసరఫరా, బీఎస్ఎన్ఎల్, గుర్తింపు పొందిన మీడియా వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధుల్లో ఉన్న వారికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ జారీ చేసి, వారు విధులు నిర్వర్తించే చోట ఓటు హకు వినియోగించేలా చర్యలు చేపట్టామన్నారు. ఏరోజు కారోజు పోలైన పోస్టల్ బ్యాలెట్లు, పోల్ కాని పోస్టల్ బ్యాలెట్లు సంబంధిత సహాయ రిటర్నింగ్ అధికారికి అప్పగించాలన్నారు. కాగా.. దీనిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.