న్యూఢిల్లీ : అన్ని ఫార్మాట్లలో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచిన భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు. ఆమె విజయ కథ మహిళలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కి బాత్’ 75 వ ఎపిసోడ్ ఆదివారం జరిగింది. దీనిలో మిథాలీరాజ్ పట్టుదల, దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
అంతర్జాతీయ మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ ఇటీవల 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా నిలిచారు. వన్డేల్లో 7,000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్గా కూడా వినుతికెక్కారు. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో మిథాలీరాజ్ 10 వేల పరుగుల మైలురాయికి చేరుకున్నది. రెండు రోజుల తరువాత జరిగిన వన్డేల్లో 7,000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచి తన కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నది.
మహిళా క్రికెట్కు ఆమె చేసిన తోడ్పాటు అద్భుతమైనది అని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ఘనత సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. తన రెండు దశాబ్దాల కెరీర్ ద్వారా మిథాలీరాజ్ చాలా మందికి స్ఫూర్తినిచ్చారని, ఆమె కృషి, విజయాల కథ మహిళలకు మాత్రమే కాకుండా పురుషుల క్రికెటర్లకు కూడా ప్రేరణ కలిగిస్తుందని అని ఆయన అన్నారు.
ఇదే సమయంలో.. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచ కప్ రైఫిల్ / పిస్టల్ / షాట్గన్లో భారత షూటర్లు సాధించిన విజయాల గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుతం 13 స్వర్ణాలతో కలుపుకుని మొత్తం 28 పతకాలతో భారత్ పతకాల పట్టీలో అగ్రస్థానంలో ఉన్నది. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత షూటర్లకు అభినందనలు అని మోదీ అన్నారు. ఈ నెల ప్రారంభంలో స్విస్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సాధించిన విజయంపై కూడా ప్రధాని మాట్లాడారు.
‘మార్చి నెలలో మహిళా దినోత్సవాన్ని జరుపుకున్న సమయంలో.. చాలా మంది మహిళా అథ్లెట్లు పతకాలు సాధించి రికార్డులు సృష్టించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో భారతదేశం పతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది. భారత పురుషులు, మహిళా షూటర్లు చేసిన అద్భుత ప్రదర్శనల ద్వారా ఇది సాధ్యమైంది. అలాగే, పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో రజత పతకం సాధించారు’ అని మోదీ అన్నారు.
అంతా పబ్లిక్ చేయకూడదు: శరద్ పవార్తో భేటీపై అమిత్షా
లైంగికదాడి, హత్య కేసులో దోషికి మరణశిక్ష
విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నం.. పోలీసులకు అప్పగింత
ఇండోనేషియాలో బాంబు పేలుడు.. 14 మందికి గాయాలు
సప్త వర్ణాల శోభితం.. వివిధ రాష్ట్రాల్లో హోలీ కేళీ
అద్భుతమైన విజయాలకు మరో పేరు.. సైనా నెహ్వాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..