ముంబై : మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం తారాస్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో కేంద్ర హోం మంత్రి అమిత్షా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. వీరి మధ్య జరిగిన రహస్య సమావేశాన్ని ధ్రువీకరించేందుకు లేదా తిరస్కరించేందుకు అమిత్షా నిరాకరించారు.
అహ్మదాబాద్లో శనివారం పవార్తో భేటీ జరిగిందన్న దానిపై మీడియా ప్రశ్నించడంతో.. తొలుత ప్రశ్నార్థకంగా ముఖం పెట్టిన అమిత్షా అనంతరం తేరుకుని.. ‘ప్రతిదీ బహిరంగపరచవలసిన అవసరం లేదు’ అని చెప్పారు. భేటీ జరిగిన విషయాన్ని మీడియా పదే పదే ప్రశ్నించినా ఆయన ధ్రువీకరించలేదు. అదే సమయంలో కాదని చెప్పలేదు. అంతకు ముందు మీడియా అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పేందుకు అమిత్షా ఆసక్తి చూపారు.
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడి (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వంలో సభ్యురాలుగా ఉన్నది. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించారు.
ముంబైలోని బిలియనీర్ ముఖేష్ అంబానీ ఇంటికి సమీపంలో భద్రతా భయంతో సంబంధం ఉన్న ఘటన వెల్లడిపై అప్రాధాన్య పోస్టింగ్కు బదిలీ అయిన పరంబీర్ సింగ్.. ఆ మరుసటి రోజున ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి నెలకు రూ.100 కోట్లు కలెక్ట్ చేసి ఇవ్వాలంటూ పోలీసులను ఒత్తిడి చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
గుజరాత్లోని స్థానిక వార్తాపత్రికల ప్రకారం.. శరద్ పవార్, అతడి పార్టీ సహోద్యోగి ప్రఫుల్ పటేల్.. అమిత్ షాను అహ్మదాబాద్లోని ఫామ్హౌస్లో శనివారం కలిశారు. బీజేపీ ఈ కేసు విచారణపై ఒత్తిడిని కొనసాగిస్తున్నందున వీరి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. గుజరాత్ పత్రికలు కోడై కూసినా పవార్తో భేటీ జరిగిందని లేదా జరుగలేదని మాత్రం అమిత్షా చెప్పడం లేదు. ఇలాఉండగా, హోంమంత్రిపై మాజీ పోలీసు కమిషనర్ చేసిన ఆరోపణలపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది.
లైంగికదాడి, హత్య కేసులో దోషికి మరణశిక్ష
విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నం.. పోలీసులకు అప్పగింత
ఇండోనేషియాలో బాంబు పేలుడు.. 14 మందికి గాయాలు
సప్త వర్ణాల శోభితం.. వివిధ రాష్ట్రాల్లో హోలీ కేళీ
అద్భుతమైన విజయాలకు మరో పేరు.. సైనా నెహ్వాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..