న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సహా, కోల్కతా నగరంలో పెట్రోల్ లీటర్ రూ.100 మార్క్ను ధాటింది. చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్పై 35, డీజిల్పై 17 పైసలు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100.21కు చేరగా.. డీజిల్ రూ.89.53కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్ రూ.106.25, డీజిల్ రూ.97.09కు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్ను దాటడం ఇదే తొలిసారి. మే నెలలో తొలిసారిగా భోపాల్లో పెట్రోల్ రూ.100 దాటింది. ఆ తర్వాత జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరునంతపురంలో.. గత నెల చివరి వారంలో చెన్నై, భువనేశ్వర్లో రూ.100 మార్క్ను చేరింది. ప్రస్తుతం పెట్రోల్ 16 రాష్ట్రాలు, యూటీల్లో వంద దాటింది. డీజిల్ రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో డీజిల్ రూ.100 దాటింది. జులైలో ఇప్పటి ఇంధన ధరలు ఐదుసార్లు పెరగ్గా.. మే 4వ తేదీ తర్వాత 37 సార్లు ఇంధన ధరలను చమురు కంపెనీలు పెంచాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు
ఢిల్లీలో పెట్రోల్ రూ.100.21.. డీజిల్ రూ.89.53
ముంబైలో పెట్రోల్ రూ.106.25.. డీజిల్ రూ.97.09
కోల్కతా పెట్రోల్ రూ.100.23.. డీజిల్ రూ.92.50
చెన్నైలో పెట్రోల్ రూ.101.06.. డీజిల్ రూ.94.06
బెంగళూరులో పెట్రోల్ రూ.103.56.. డీజిల్ రూ.94.89
హైదరాబాద్లో పెట్రోల్ రూ.104.14.. డీజిల్ రూ.97.58
పాట్నాలో పెట్రోల్ రూ.102.40.. డీజిల్ రూ.94.99
చండీగఢ్లో పెట్రోల్ రూ.93.37.. డీజిల్ రూ.89.16
భోపాల్లో రూ.108.52.. డీజిల్ రూ.98.30
లక్నోలో పెట్రోల్ రూ.97.33.. డీజిల్ రూ.89.92
రాంచీలో పెట్రోల్ రూ.94.43.. డీజిల్ రూ.94.48