పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద లారీ.. స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కమాన్పూర్ ఏఎస్ఐగా పని చేస్తున్న భాగ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. పెద్దపల్లిలో తమ నివాసం నుంచి కూతురుతో కలిసి బస్టాండ్కు వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. లారీ ఢీకొట్టడంతో భాగ్యలక్ష్మి పై నుంచి వెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె కూతురు ద్విచక్ర వాహనం నడుపుతుండగా.. స్వల్ప గాయాలతో బయటపడింది. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేశ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..