న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి తొమ్మిదో అంతస్తులో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ డయాగ్నొస్టిక్ ల్యాబ్లు, పరీక్షా విభాగాలున్న భవనంలో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో ఎయిమ్స్ సెట్ (స్కిల్స్, ఈ-లెర్నింగ్, టెలిమెడిసిన్) సౌకర్యం, ఆడిటోరియం ఉన్నాయి. మంటలు చెలరేగిన వెంటనే 22 ఫైర్ టెండర్లను తరలించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.
అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కొవిడ్-19 నమూనాలను సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగాయని డెప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలిపారు. రాత్రి రూ.10.30 గంటల సమయంలో తమకు అత్యవసర సమాచారం వచ్చిందని చెప్పింది. వెంటనే 22 ఫైర్ టెండర్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.