న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతున్నది. వైరస్ ముప్పు మాత్రం తగ్గలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతోంది. ప్రస్తుతం కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు రోజుల మధ్య విరామంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో డాక్టర్ ఎన్కే అరోరా స్పందించారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ట్రయల్స్ తర్వాతే డోసుల మధ్య విరామం పెంచినట్లు పేర్కొన్నారు. అరోరా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) చీఫ్. కొవిషీల్డ్ రెండో మోతాదుల మధ్య 12-16 మోతాదుల మధ్య వ్యవధిని దేశంలో నిర్వహించిన పరీక్షల ప్రకారమే పెంచినట్లు చెప్పారు.
కొవిషీల్డ్ మొదటి మోతాదు డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా 61 శాతం ప్రభావవంతగా పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు. టీకా డ్రైవ్ ప్రారంభించిన సమయంలో రెండు మోతాదుల మధ్య అంతరం నాలుగు వారాలు అని, ట్రయల్స్ ఫలితాల ప్రకారం నిర్ణయించారన్నారు. నాలుగు వారాల వ్యవధిలో రోగనిరోధక ప్రతి స్పందన చాలా బాగుందని తమకు తెలిసిందన్నారు. అయితే, ఆ సమయంలో బ్రిటన్ అంతరాన్ని 12 వారాలకు పెంచిందని, ఆల్ఫా వేరియంట్కు సంబంధించిన సవాళ్లను యూకే ఎదుర్కొంటున్న సమయంలోనే పెంపు జరిగిందన్నారు.
సమీక్షల తర్వాతనే మోతాదుల మధ్య విరామం పెరిగిందని డాక్టర్ అరోరా చెప్పారు. మొదటిది నాలుగు వారాల విరామంలో మాత్రమే పని చేస్తోందని, కానీ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన సూచనల తర్వాతే ఆరు నుంచి ఎనిమిది వారాల విరామం పొడగించారన్నారు. ఏప్రిల్లో పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ 12 వారాల వ్యవధిలో ఇచ్చినప్పుడు టీకా 65 శాతం నుంచి 80 శాతం వరకు ప్రభావవంతంగా ఉంటుందని సూచించింది. డెల్టా వేరియంట్తో భారత్ పోరాడుతున్న సమయం ఇదన్నారు.
డెల్టా సంక్రమణ సమయంలో డేటాను, వేలాది కేసులను పరిగణలోకి తీసుకొని సీఎంసీ వెల్లూర్ కొవిషీల్డ్ మొదటి మోతాదు వేరియంట్కు 61శాతం, రెండు మోతాదుల్లో 65 శాతం ప్రభావవంతంగా ఉందని చూపించిందని డాక్టర్ ఆరోరా పేర్కొన్నారు. వ్యాక్సిన్ మోతాదుల్లో అంతరంపై ప్రస్తుత నిర్ణయం సరైనదని తేలితే, దాన్ని కొనసాగిస్తామన్నారు. యూకే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఏజెన్సీ.. ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్’ ఏప్రిల్ చివరి వారంలో డేటాను విడుదల చేసింది. వ్యాక్సిన్ మోతాదుల మధ్య 12 వారాల విరామం ఉన్న సమయంల సమర్థత 65 నుంచి 88 శాతం మధ్య ఉంటుందని తెలిపింది.