ముంబై: ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ముగియగానే టీమిండియాలో ఉన్న హార్దిక్, కృనాల్ పాండ్యా బ్రదర్స్తోపాటు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ టీమ్తో చేరారు. పుణెలో మ్యాచ్ ముగియగానే వీళ్లు ముంబై బయలుదేరి వెళ్లారు. అక్కడ ముంబై టీమ్ ఉన్న హోటల్కు వెళ్లి టీమ్తో కలిశారు. ఈ ముగ్గురూ వచ్చిన వీడియోను ముంబై ఇండియన్స్ టీమ్ తమ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో నేషనల్ టీమ్కు తొలిసారి ఆడిన సూర్యకుమార్ ఈ సందర్భంగా తన కల నెరవేరినట్లు చెప్పాడు. ఇక మరోసాని ముంబై ఇండియన్స్తో తన జర్నీ మొదలైనట్లు తెలిపాడు. ఏప్రిల్ 9న ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుండగా.. చెన్నైలో జరగనున్న తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్వో
జీవితంలో మరచిపోలేని సీజన్ ఇది.. టీమిండియాపై రవిశాస్త్రి ప్రశంసలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్