న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12.25 కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం రాత్రి వరకు 25.65 లక్షలకుపైగా డోసులు వేసినట్లు పేర్కొంది. శనివారం రాత్రి 8 గంటల వరకు తాత్కాలిక నివేదిక ప్రకారం.. 12,25,02,790 డోసులు వేసినట్లు చెప్పింది. ఇందులో 91,27,451 హెల్త్కేర్ వర్కర్లకు మొదటి డోసు, మరో 57,07,322 మందికి రెండో మోతాదు ఇచ్చినట్లు పేర్కొంది. అలాగే ఫ్రంట్లైన్ కార్మికుల్లో 1,12,29,062 మందికి మొదటి మోతాదు, 55,08,179 మందికి రెండో మోతాదు వేసినట్లు చెప్పింది.
45 నుంచి 60 సంవత్సరాల వయసున్న వారిలో 4,04,16,170 మందికి మొదటి, 10,76,752 మందికి రెండో డోసు వేశామని, 60 ఏళ్లకుపైబడిన 4,55,60,187 మందికి ఫస్ట్ డోస్, 38,77,667 మందికి సెకండ్ డోసు పంపిణీ చేసినట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా 92వ రోజు రాత్రి 8 గంటల వరకు 25,65,179 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు చెప్పింది. ఇందులో 19,24,416 మంది లబ్ధిదారులకు మొదటి మోతాదులు, 6,40,763 మంది లబ్ధిదారులకు రెండో డోసు టీకా వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.