న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బృహత్తర నిర్ణయం తీసుకున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ ఏడాది ఎంట్రెన్స్ టెస్ట్లు ఉండవని యూజీసీ ప్రకటించింది. ఎలాంటి ప్రవేశ పరీక్షలు జరుపకుండానే నేరుగా గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని అన్ని సెంట్రల్ వర్సిటీలకు ఆదేశించింది. సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూసెట్) ను 2022-23 విద్యాసంవత్సరం నుంచి తిరిగి అమలుచేయనున్నట్లు యూజీసీ పేర్కొన్నది.
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇంకా ఉద్ధృతంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 2021-22 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాలు జరిపే మార్గదర్శకాలను యూజీసీ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల్లో ప్రవేశాలను సెప్టెంబర్ 30 లోగా ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలన్నది. అదేవిధంగా ఆగస్ట్ 30 లో గా అన్ని డిగ్రీ, పీజీ కోర్సుల ఫైనల్ సెమిస్టర్, ఇయర్ పరీక్షలను పూర్తిచేయాలని అన్ని యూనివర్సిటీలను యూజీసీ ఇప్పటికే ఆదేశించింది. సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 లో చేర్చింది. దేశంలోని సెంట్రల్ వర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశపరీక్షలను మరింత ఆధునీకరించే పద్ధతులను తెలియజేసేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది.
ఒక్క వన్డే.. 10 రికార్డులు.. అవేంటంటే..!
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
ఈ టీచర్లు జిహదీలను తయారుచేస్తారంట..!
సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్..! ఎందుకంటే..?
త్వరలో స్పేస్ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..