కౌటాల, ఏప్రిల్ 18 : మండల కేంద్రం నుంచి టేకంగూడ వరకు బీటీ రోడ్డు పనుల కోసం రోడ్డును తవ్వి వదిలేయడంతో ఇబ్బందులు పడుతున్నామని గుడ్లబోరి ఎంపీటీసీ వసంత్రావు పలువురితో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది నెలలుగా రోడ్డును తవ్వి దానిపై కంకర వేసి వదిశారన్నారు. దీనితో ఇప్పటికి చాలా మంది మోటార్ సైకిల్పై పడి గాయాలయ్యాయన్నారు. సదరు కాంట్రాక్టర్ రోడ్డు పనులు పూర్తి చేయకపోతే గ్రామాల ప్రజలందరితో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ రాందాస్, యువకులు వాయు కుమార్, సునీల్, వంశీ, విశ్వనాథ్ పాల్గొన్నారు.