దండేపల్లి, ఏప్రిల్28 : కాంగ్రెస్, బీజేపీల బూటకపు హామీలను నమ్మి మోసపోవద్దని పెద్దపెల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఆదివారం రాత్రి దండేపల్లి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో వారు మాట్లాడా రు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అవకాశమివ్వాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని పెద్దపెల్లి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోవాలన్నారు.
3 నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నో కష్టాలను చూస్తున్నామని, మున్ముం దు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదన్నారు. కేసీఆర్ సర్కా రు చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన అవసరముందన్నారు. గులాబీ సైనికులను ఇబ్బంది పెట్టడం పక్కన పెట్టి పా లనపై శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. ఎక్కడ ఏ చిన్న కష్టమొచ్చినా మీ ముందుంటానని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అక్కల రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ భూమన్న, యూత్ ప్రధాన కార్యదర్శి అల్లంల సం తోష్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, ఏప్రిల్ 28 : బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా పని చేయాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కార్యకర్తలు, నాయకులను కోరారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే కలిగే నష్టాన్ని వివరించాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.