బెజ్జూర్, ఏప్రిల్ 28 : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలిపించాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఆదివారం మండలంలోని మర్తిడి, లుంబీనీనగర్, తుమ్మలగూడ, కుకుడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుకుడలో ఆయ న మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పదేళ్లు పాలన చేసి చేసిందేమీ లేదని, మరోసారి గెలిస్తే రిజర్వేషన్లు తొలగించడంతో పాటు రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి రైతులు, సామాన్య ప్రజల కష్టాలు పట్టవని చెప్పుకొచ్చారు.
రాష్ట్రం లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని, ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కుకుడ కు చెందిన 30 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్సీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీటీసీ పంద్రం పుష్పలత, మాజీ సర్పంచ్ మేర్గు తిరుపతి, నాయకులు సోమం చిన్నయ్య, సామల రాజన్న, ఖాజా సమీయొద్దీ న్, లచ్చయ్య, రమేశ్, మహేశ్, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.