Loksabha Elections 2024 : కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తమ కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఉన్నా, లేకున్నా దేశం ఉంటుందని అన్నారు. కానీ కాంగ్రెస్, ఎస్పీలు తమ భవిష్యత్, తమ పిల్లల భవిష్యత్పైనే దృష్టి సారిస్తాయని ఆరోపించారు. యూపీలోని ఇటావాలో ఆదివారం జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.
దేండ్ల పదవీకాలం తర్వాత మీ ఆశీస్సులు కోరేందుకు తాను మళ్లీ ఇక్కడకు వచ్చానని అన్నారు. తాను దేశం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తీరు ప్రజలు చూశారని, నిజాయితీతో మీకు సేవలందించడం తన ధర్మమని చెప్పారు. రాబోయే ఐదేండ్ల కోసం కాకుండా మరో పాతికేండ్ల ప్రగతి ప్రస్ధానం దిశగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీలో పస లేదని, ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం దేశంలో మత చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు.
ఎన్నికల్లో ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెడుతున్నారని దుయ్యబ్టటారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందని ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ముస్లింలను కాంగ్రెస్ కేవలం ఓటుబ్యాంక్గా పరిగణిస్తోందని దుయ్యబట్టారు. కేవలం ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకే కాదు దేశాన్ని నిర్మించేందుకూ రాజకీయాలను సాధనంగా చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీకి ఆయన హితవు పలికారు.
Read More :