లక్నో : ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అందాల నటి, మోడల్ దీక్షా సింగ్ సిద్ధమైంది. నేడో, రేపో దీక్షా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనుంది. జౌన్పూర్ జిల్లాలోని బాక్షా బ్లాక్లోని 26వ వార్డు నుంచి దీక్షా తండ్రి జితేంద్ర సింగ్ పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.
కానీ ఆ వార్డు మహిళకు రిజర్వు కావడంతో తన కుమార్తెను బరిలోకి దింపాడు. దీక్షాపై బీజేపీ నాయకుడు దివంగత రామ్ చంద్ర సింగ్ కోడలు శాలిని సింగ్ పోటీ చేస్తున్నారు. జౌన్పూర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఏప్రిల్ 15న జరగనున్నాయి. దీక్షా తండ్రి జితేంద్ర సింగ్ గోవా, రాజస్థాన్లో ట్రాన్స్పోర్టు బిజినెస్ చేస్తున్నాడు.