కుత్బుల్లాపూర్, సెప్టెంబర్1: పేదల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను గురువారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 473 మంది కొత్త లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ మే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ.. యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుం డా అమలు చేస్తూ..నేరుగా లబ్ధిదారుల చెంతకు చేరేలా పథకాలను అందించడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో 35.95 లక్షల మందికి ఆసరా పింఛన్లు ప్రతి నెలా అందుతున్నాయని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులు, తదితరులకు పింఛన్లు ఇస్తున్న ఘన త తెలంగాణ రాష్ర్టానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్ , వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, కమిషనర్ రఘు, కౌన్సిలర్లు చింతల రవీందర్, డప్పు కిరణ్, చింతల లక్ష్మీదేవేందర్, మాజీ ఎంపీపీ సన్న కవితతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్మెంబర్లు, అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.