సంగారెడ్డి అర్బన్, జూన్ 29: సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో శస్త్ర చికిత్స చేసి కాలులో ఉన్న ఐదు రాళ్ల ముక్కలను తొలగించినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు. జోగిపేట మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ 6నెలల క్రితం వ్యవసాయ పనులు చేస్తుండగా కుడికాలు పాదంలో బండరాయి గుచ్చుకుంది. గుచ్చుకున్న ఆ రాయిని తీసేసిన సుధాకర్కు నాలుగైదు రోజులకు గాయం నయమైంది. కాని అప్పుడప్పుడు పాదంలో నొప్పి వస్తుండటం, ఈ మద్య భరించలేని నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభు త్వ దవాఖానకు చికిత్స కోసం వచ్చాడు. ఎక్స్రే తీసి చెక్ చేసిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఎముకల్లో రాళ్ల ముక్కలు ఉన్నట్లు అనుమానంతో అడ్మిట్ చేసుకున్నారు. శస్త్ర చికిత్స చేసి లోపల ఉన్న రాళ్ల ముక్కలను తొలగించారు. ప్రస్తుతం పెషేంట్ కోలుకుంటున్నాడు.