Maneka Gandhi | ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి మేనకా గాంధీ (Maneka Gandhi) తన మొత్తం ఆస్తులను ప్రకటించారు (Declares Assets). ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికైన మేనకా గాంధీ తన కుటుంబ ఆస్తులు మొత్తం రూ.97 కోట్లని వెల్లడించారు. ఈ మేరకు సుల్తాన్పూర్ నియోజకవర్గ లోక్ సభ స్థానానికి వేసిన నామినేషన్లో ఈ వివరాలను పొందుపరిచారు.
ఆ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. మేనకా గాంధీ తన కుటుంబ ఆస్తుల విలువ మొత్తం రూ.97.17 కోట్లుగా వెల్లడించారు. అందులో చరాస్తుల విలువ రూ.45.97 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.51.20 కోట్లు. తన బ్యాంకు ఖాతాలో మొత్తం రూ.17.83 కోట్లు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద రూ.2.82 కోట్ల విలువైన 3.415 కిలోల బంగారు ఆభరణాలు, 85 కిలోల వెండితోపాటు రూ.40 వేల విలువైన రైఫిల్ ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు.
Also Read..
Lok Sabha Elections | హాట్ ఎయిర్ బెలూన్తో ఓటింగ్పై అవగాహన.. ఎన్నికల సంఘం వినూత్న ఆలోచన
Google Layoff | మరో 200 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్!