Loksabha Elections 2024 : బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలతో విరుచుకుపడ్డారు. కర్నాటకలోని కలబురగిలో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మీ ఆస్తులను గుంజుకుని ముస్లింలకు పంచుతామని వారు (బీజేపీ) ప్రచారం చేస్తున్నారు.
నిజాంల కాలంలోనూ ఇలా జరగలేదు..మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం..అలాంటి రోజు రాకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని మాట ఇస్తున్నామని ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి మంగళసూత్రాన్నీ తీసుకోదని చెప్పారు.
ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ స్ధానిక ఎంపీ ఎన్నడూ నియోజకవర్గానికి రాలేదని, గత ఐదేండ్లలో నియోజకవర్గానికి ఎంపీ చేసిందేమీ లేదని అన్నారు. మహిళలు సమాజంలో భారమంతా వారే మోస్తున్నా మోదీ సర్కార్ వారి బాధలను ఆలకించడం లేదని ఆమె దుయ్యబట్టారు.
Read More :