Supreme Court | మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల అరెస్ట్ విషయంలో సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం కీలక తీర్పును (Big Ruling) వెలువరించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే ఆ కేసులో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు అరెస్ట్ చేయకూడదని వెల్లడించింది.
పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 44 కింద దాఖలైన మనీలాండరింగ్ ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే ఆ కేసుల్లో నిందితుడిని సెక్షన్ 19 కింద అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు ముందుగా సమన్లు జారీ చేస్తే.. ఆ సమన్లకు నిందితుడు సరైన సమాధానమిస్తే వారు కస్టడీలో ఉన్నట్లు చూడలేమని పేర్కొంది. సమన్లకు హాజరై సమాధానం ఇచ్చిన తర్వాత తదుపరి విచారణ కోసం నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తే.. దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అప్పుడు కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టు విశ్వసిస్తే నిందితుడిని ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతిస్తుంది అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు నిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read..
Hepatitis A | కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్.. 12 మంది మృతి.. నాలుగు జిల్లాలకు అలర్ట్