గువాహటి: అసోంలో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తేజ్పూర్ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కానీ జరగలేదని వెల్లడించింది.
అసోంలో గత కొన్నిరోజులుగా క్రమం తప్పకుండా భూకంపాలు వస్తున్నాయి. నిన్న సాయంత్రం 7.22 గంటలకు సోనిత్పూర్లో 3.5 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా ఈ నెల 3న అదే ప్రాంతంలో 3.7 తీవ్రతత భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. మే 1న (శనివారం) సాయంత్రం 8.09 గంటల ప్రాంతంలో తేజ్పూర్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.3 గా నమోదయ్యిందని ఎన్సీఎస్ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి