హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ల ధరలు ఆదివారం పెరిగాయి. వాణిజ్య సిలిండర్ల ధరలపై రూ.73.50 పెంచిన చమురు కంపెనీలు సామాన్యులకు మాత్రం కాస్త ఊరట కలిగించాయి. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర పాతరేట్లే కొనసాగనున్నాయి. తాజాగా పెంపు వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధానిలో రేటు రూ.1500 నుంచి రూ.1623 కి పెరిగింది. గత జూలై నెలలో చమురు కంపెనీలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్పై రూ.25.50, కమర్షియల్ సిలిండర్పై రూ.84వరకు పెంచాయి.
కమర్షియల్ సిలిండర్లను ఎక్కువగా హోటళ్లు, ఇతర వ్యాపార అవసరాలకు కోసం వినియోగిస్తున్నారు. కేవలం రెండు నెలల్లో రూ.157.50 వరకు ధర పెరగడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.1803గా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2కిలోల సబ్సిడీ సిలిండర్ ధర రూ.834.50కి చేరగా.. కోల్కతాలో రూ.861, ముంబైలో రూ.864.50, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్లో రూ.887 ధర పలుకుతోంది.