ఖాట్మండు: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి ఈ నెల 10 వ తేదీన విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ను రాష్ట్రపతి బిద్యాదేవి భండారి ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దీంతో ప్రతినిధుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విశ్వాస ఓటును నిరూపించుకోవాల్సి ఉంటుంది.
నేపాల్ దిగువ సభలోని మొత్తం 275 సీట్లలో.. కేపీ శర్మ ఒలి నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్కు 121 సీట్ల బలం ఉండగా.. ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్కు 63, సీపీఎన్-మావోయిస్టులకు 49 సీట్లు ఉన్నాయి. ప్రధానమంత్రి ఒలి గత డిసెంబరు నెలలో ప్రతినిధుల సభను రద్దు చేయడంతో నేపాల్లో రాజకీయ సంక్షోభం మొదలైంది. అయితే, ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి నెలలో పార్లమెంటు దిగువ సభను తిరిగి నియమిస్తూ చారిత్రక తీర్పునిచ్చింది. సీపీఎన్-ఎంసీని సీపీఎన్-యూఎంఎల్తో విలీనం చేయడాన్ని గత నెలలో సుప్రీంకోర్టు రద్దు చేయడంతో దేశంలో రాజకీయ పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. ఈ కూటమి 2017 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అనంతర పరిణామాల్లో రెండు పార్టీలు 2018 మే నెలలో విలీనమై ఏకీకృత నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీగా అవతరించింది.
నేపాల్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్, ఇతర పార్టీల సహకారంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి ప్రభుత్వాన్ని పడగొట్టింది. తన సారధ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేపాలీ కాంగ్రెస్ కేంద్ర కార్యవర్గం చొరవ తీసుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ సీనియర్ నాయకుడు ప్రకాష్ మన్ సింగ్ తెలిపారు. వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ఒలిని నేపాలీ కాంగ్రెస్ కోరనున్నట్లు సింగ్ చెప్పారు.
చైనాపై వైఖరి మార్చుకున్న న్యూజిలాండ్
తన నిర్ణయాన్ని సమర్ధించుకున్న ఆస్ట్రేలియా ప్రధాని
మయన్మార్లో ఆర్మీ అణచివేత: సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఆన్లైన్లో 60 మంది వైద్యులు.. వివిధ భాషల్లో సేవలు
అద్వానీ రథయాత్ర కారకుడు ప్రమోద్ మహాజన్.. చరిత్రలో ఈరోజు
లాక్డౌన్ తరహా ఆంక్షలు పొడగించిన పంజాబ్ ప్రభుత్వం
ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం
బంగ్లాదేశ్లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..