మెల్బోర్న్ : భారత్ నుంచి పౌరులు తమ దేశానికి తిరిగి రాకుండా విధించిన నిషేధం నిర్ణయాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ సమర్ధించుకున్నారు. భారతదేశం నుంచి తిరిగి వచ్చే వారికి జైలుశిక్ష లేదా జరిమానా విధించాలన్న తన ప్రభుత్వ నిర్ణయం సరైనదే అని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, థర్డ్ వేవ్ ఇన్ఫెక్షన్ను ఆపడమే దీని లక్ష్యమని ఆయన అన్నారు.
14 రోజుల పాటు భారతదేశంలో ఉన్న తమ పౌరులు తిరిగి ఆస్ట్రేలియా రావడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి ఐదేండ్ల జైలుశిక్ష లేదా దాదాపు 51,000 డాలర్ల జరిమానా (భారత కరెన్సీలో రూ.37 లక్షలు) విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇది చాలా కటినమైన నిర్ణయం అని మోరిసన్ చెప్పారు. థర్డ్ వేవ్ దేశంలో వ్యాప్తి చెందకుండా, వ్యవస్థ బలంగా ఉండేలా చూడటం దీని లక్ష్యమని స్పష్టం చేశారు. భారతీయ సమాజం పట్ల తనకు ఆందోళన ఉన్నదని, అయితే, తమ దేశంలో మళ్లీ వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరగకుండా చూడటమే తమ ఉద్దేశమన్నారు.
భారత్ నుంచి వచ్చిన పలువురిలో కరోనా పాజిటివ్ నివేదికలు వచ్చిన నేపథ్యంలో భారత్లో పరీక్షలు సరైన రీతిలో జరుపడంలేదని అక్కడి వైద్యులు ఆరోపించారు. అక్కడి నుంచి వచ్చిన పలువురిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయని, దీని ద్వారా వారు అక్కడ జరిపే పరీక్షలపై అనుమానం వస్తున్నట్లు వారు తెలిపారు.
మయన్మార్లో ఆర్మీ అణచివేత: సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఆన్లైన్లో 60 మంది వైద్యులు.. వివిధ భాషల్లో సేవలు
అద్వానీ రథయాత్ర కారకుడు ప్రమోద్ మహాజన్.. చరిత్రలో ఈరోజు
లాక్డౌన్ తరహా ఆంక్షలు పొడగించిన పంజాబ్ ప్రభుత్వం
ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం
బంగ్లాదేశ్లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..