బెంగళూరు : ఇటీవల వరుసగా పెరుగుతున్న కొవిడ్ కేసులను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే, మైసూర్, కాలబురిగి, దక్షిణ కన్నడ, ఉడిపి, బీదర్, హుబ్లీ-ధార్వాడ్ సహా బెంగళూరు అర్బన్, రూరల్ తదితర జిల్లాల పరిధిలో ఆంక్షలు విధించింది. ఆయా జిల్లాలోని పబ్లు, బార్లు, క్లబ్లు, రెస్టారెంట్లలో కస్టమర్ల సంఖ్య 50శాతానికి మించరాదని ఆదేశించింది.
షాపింగ్ మాల్స్, క్లోడ్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్లలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం నిబంధనలు అమలు చేయడంతో పాటు ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. మరో వైపు ప్రభుత్వం 6-9 తరగతులను నిలిపి వేసింది. జిమ్లు, స్విమ్మింగ్ ఫూల్స్ మూసివేసి ఉండనున్నాయి. అలాగే ధర్నాలు, ర్యాలీలు నిషేధించారు. నిన్న ఒకే రోజు 4,991 కొవిడ్-19 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 10,06,229కు పెరిగాయి.