న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2019 సంవత్సరానికి గాను ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ నిలిచింది.
జాతీయ స్థాయిలో ఉత్తమ కొరియోగ్రాఫర్-రాజు సుందరం (మహర్షి),
నిర్మాణ సంస్థ-వెంకటేశ్వర క్రియేషన్స్ (మహర్షి)
ఉత్తమ ఎడిటర్-నవీన్ నూలి (జెర్సీ),
ఉత్తమ తమిళ చిత్రం అసురన్
ఉత్తమ నటుడు-ధనుష్ (అసురన్)
ఉత్తమ నటి-కంగనా (మణికర్ణిక)
సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చిచోరే ఉత్తమ హిందీ చిత్రంగా నిలిచింది.
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు కూడా సత్తా చూపించాయి. మరీ ముఖ్యంగా నాని నటించిన జెర్సీ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. నాని-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కిన జెర్సీ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.
2019 ఏప్రిల్ 19 న విడుదలైన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన జెర్సీ సినిమాలో నాని నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు జాతీయ అవార్డు కూడా ఈ సినిమాను వరించడంతో దర్శక నిర్మాతలు సంతోషంగా మునిగిపోయారు.
ఒక అరుదైన వ్యాధి కారణంగా తాను ఎంతగానో ప్రేమించి క్రికెట్ ను పాతికేళ్ల వయసులోనే వదిలేసి.. ఆ తర్వాత కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో తిరిగి మొదలు పెట్టి చివరికి ప్రాణాలు వదిలేసిన ఒక ఆటగాడు కథ జెర్సీ.
మహర్షి సినిమాలో ఒక పాటను కంపోజ్ చేసిన కొరియోగ్రఫర్ రాజు సుందరంకు జాతీయ అవార్డు వరించింది. తమ సినిమాలకు జాతీయ అవార్డు రావడంతో పండగ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
పుష్ప విలన్ పారితోషికం వింటే షాకే..!
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
‘జాతి రత్నాలు’ కలెక్షన్స్.. జోగిపేట్ కుర్రాళ్లు తగ్గట్లేదు
కరోనా రెండో దశ వచ్చిందా.. ఇండస్ట్రీ పరిస్థితేంటి?
నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ
అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్
తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..
పవన్ సినిమాతో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ ఓపెనింగ్
అమాంతం రేటు పెంచిన జాతిరత్నం.. పర్లేదు అంటున్న నిర్మాతలు