మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉంటూనే…మరోవైపు 3 ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్, మెహర్ రమేశ్ డైరెక్షన్లో వేదాలమ్ రీమేక్ ఉన్నాయి. మరోవైపు బాబీ దర్శకత్వంలో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చిరు. బాబీ-చిరు కాంబోలో వచ్చే సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని ఇప్పటివరకు టాక్ ఉంది.
తాజాగా దీనిపై మరో అప్డేట్ ఒకటి లైమ్లైట్లోకి వచ్చింది. ఈ చిత్రం రూరల్ ఎంటర్ టైనర్ గా ఉండనుందట. మైత్రీ మూవీ మేకర్స్ చిరు-బాబీ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ క్రేజీ మూవీ సంబంధించిన మరిన్ని వివరాలపై మరికొంతకాలం ఆగితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షిసిన్హాను హీరోయిన్ గా దాదాపు ఖరారు చేసినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.