టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడు ఫహద్ ఫాసిల్. ఈ యాక్టర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. పుష్ప కోసం ఫహద్ ఫాసిల్ ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది.
పుష్ప ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా మొదలు కానుంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.