Loksabha Elections 2024 : కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ఎలాంటి ప్రస్తావన లేదని సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వారసత్వ పన్ను రద్దు చేశారని చెప్పారు.
వారసత్వ పన్ను తమ మేనిఫెస్టోలో లేదని, ఇది తమ అజెండాలోనూ లేదని జైరాం రమేష్ తేల్చిచెప్పారు. తామెన్నడూ వారసత్వ పన్ను గురించి మాటమాత్రం ప్రస్తావించలేదని అన్నారు. తమ మేనిఫెస్టోలో సంపద పున:పంపిణీ గురించి పొందుపరిచామని ప్రధాని నరేంద్ర మోదీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
50 పేజీల తమ మేనిఫెస్టోలో సంపద పున:పంపిణీ గురించి ప్రస్తావన ఎక్కడ ఉందో వెల్లడించాలని తాను మోదీకి సవాల్ విసురుతున్నానని జైరాం రమేష్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి అవాస్తవాలు మాట్లడుతున్నారని మండిపడ్డారు.
Read More :