న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 48,786 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. వైరస్ నుంచి మరో 61,588 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారని పేర్కొంది. మహమ్మారి బారినపడి 1,005 మంది రోగులు మృత్యువాతపడ్డారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,11,634కు చేరింది. మొత్తం 2,94,88,918 మంది బాధితులు కోలుకున్నారని చెప్పింది. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు మొత్తం 3,99,459 మృత్యువాతపడ్డారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులున్నాయని, టీకా డ్రైవ్లో భాగంగా మొత్తం 33,57,16,019 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.