న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43వేలకుపైగా పాజిటివ్ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 24గంటల్లో కొత్తగా 38,465 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు మరణాలు కాస్త పెరిగాయి. కొత్తగా 640 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. వైరస్ నుంచి ఇప్పటి వరకు మంది 3,07,01,612 మంది కోలుకున్నారు.
మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,22,662 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,03,840 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.28శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.38శాతానికి చేరిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 2.38శాతానికి చేరగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.52 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 46.26కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించగా.. టీకా డ్రైవ్లో భాగంగా 45.07కోట్ల మోతాదులు పంపిణీ చేసినట్లు వివరించింది.