హైదరాబాద్ : కృష్ణా ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 4,62,390 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు పది క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో 3,30,228 క్యూసెక్కులుగా ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం నీటిమట్టం 884 అడుగులున్నది. పూర్తిస్థాయి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 215.8070 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 210.0320 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. మరో వైపు ఎగువన ఉన్న జూరాల జలాశయానికి సైతం వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం 4.15లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 43 గేట్లు ఎత్తివేసి.. 4,06,604 టీఎంసీలు దిగువకు విడుదల చేస్తున్నారు. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 6.676 టీఎంసీలు నిల్వ ఉన్నది.