న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతున్నది. కొత్తగా 1.20లక్షల కేసులు నమోదవగా.. రోజువారీ కొవిడ్ కేసులు 58 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా తొమ్మిదో రోజు రెండు లక్షల కన్నా తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,20,529 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. తాజాగా 1,97,894 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న మొన్నటి వరకు కాస్త తగ్గిన కరోనా మరణాలు మరోసారి మూడువేలు దాటాయి. తాజాగా మరో 3,380 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం 2,86,94,879కు చేరాయి. ఇందులో 2,67,95,549 మంది బాధితులు కోలుకున్నారు.
ఇప్పటి వరకు 3,44,082 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 15,55,248 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. జాతీయ రికవరీ రేటు 93.38శాతానికి చేరుకుందని ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.89శాతానికి పడిపోయిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 5.78శాతానికి పడిపోయిందని, వరుసగా 12 రోజుల్లో పది శాతానికి కన్నా తక్కువగానే నమోదైందని చెప్పారు. మరో వైపు దేశంలో 36.1 కోట్లకుపైగా పరీక్షలు చేసినట్లు తెలిపింది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 22,78,60,317 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.