న్యూఢిల్లీ : భారత్ నుంచి దుబాయి, అబుదాబికి త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి దుబాయికి విమానాలు నడుస్తాయని గల్ఫ్ న్యూస్ తెలిపింది. అబుదాబికి ఈ నెల 21న సర్వీసులు పునరుద్ధరించనున్నారు. అయితే, యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) మాత్రం భారత్కు తిరిగి ఇన్బౌండ్ విమాన సర్వీసులను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఆ దేశానికి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్ మాత్రం తన వెబ్సైట్లో జూలై 15 వరకు ఆంక్షలు ఉంటాయని, ఆ తర్వాతి రోజు నుంచి యథావిధిగా భారత్కు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
అయితే, పూర్తిగా టీకాలు వేసిన వారికే అనుమతించనున్నట్లు తెలుస్తోంది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యూఏఈ భారత ప్రయాణికులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, భారత్ నుంచి దుబాయికి విమాన సర్వీసులు గత నెల 23 నుంచి తిరిగి ప్రారంభమవుతాయని భావించినప్పటికీ కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యమైంది. ఇదిలాఉండగా.. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి భారత్కు విమాన రాకపోకలపై యూఏఈ నిషేధం విధించిన విషయం తెలిసిందే. యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, సవరించిన కొవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక అనుమతి ఉన్నవారికి ఇటీవల మినహాయింపు ఇచ్చింది.