Red Sea | ఎర్ర సముద్రం (Red Sea)లో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హమాస్కు మద్దతుగా యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నౌకపై దాడి చేశారు.
భారత్కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే చమురు ట్యాంకర్ నౌక (oil tanker)పై హౌతీ రెబల్స్ క్షిపణితో దాడి చేశారు. ఈ విషయాన్ని హౌతీ తిరుగుబాటుదారులే శనివారం ప్రకటించారు. పనామా జెండా ఉన్న నౌకపై దాడి చేసినట్లు హౌతీ ప్రతినిధి యాహ్యా సరియా తెలిపారు. ఈ దాడిలో నౌకకు నష్టం వాటిల్లినట్లు బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే తెలిపింది. ఇటీవలే ఈ నౌకను విక్రయించినట్టు షిప్పింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. ఈ నౌక రష్యాలోని ప్రిమోర్క్ నుంచి గుజరాత్లోని వడినార్కు వెళ్తుండగా దాడి జరిగినట్లు ఆంబ్రే తెలిపింది.
Also Read..
Manipur Attack: మణిపూర్లో మిలిటెంట్ల అటాక్.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
Whatsapp | ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వద్దని చెప్తే.. భారత్లో వాట్సాప్ నిలిపేస్తాం!
Uttar Pradesh | జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్!