Lok Sabha Elections | సిటీబ్యూరో, మే 8(నమస్తే తెలంగాణ) : ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మంది పీవో, ఏపీవోలను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ విధుల నిర్వహణ డ్యూటీలు, కేటాయించిన వివిధ శాఖలకు చెందిన 40మంది అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరు కావడంతో పాటు, రిమాండ్ సమాచారం ఇచ్చిన స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కింద వీరందరినీ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పీఓ, ఏపీవోలకు ఈ నెల 9,10 తేదీల్లో జరిగే మూడో దశ శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారిపై ఇదే తరహా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.