ఒట్టావా: కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ మంగళవారం హెచ్చరికలు చేశారు. దేశ ప్రాదేశిక సమగ్రత, భద్రతకు ముప్పుగా భారత్ ఈ సమస్యను చూస్తున్నదని, సిక్కు వేర్పాటువాదులు ఈ విషయంలో రెడ్ లైన్ను దాటుతున్నారని హెచ్చరించారు.
నిజ్జర్ కేసుకు సంబంధించి ముగ్గురు భారత జాతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చిన నేపథ్యంలో ఆయన తొలిసారిగా ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వంద్వ పౌరసత్వాన్ని భారత్ గుర్తించదని, ఎవరైనా వలస వస్తే వారిని విదేశీయులుగానే గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు.