హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి రాగానే మరో మా ట అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ నేతల ని ర్వాకం. కంచెలపాలన బద్దలు కొట్టామని గొప్పగా చెప్పే కాంగ్రెస్ నేతలు నేడు నిరుద్యోగులకు కంచెలు అడ్డుగా పెడ్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు వెళ్లిన నిరుద్యోగులతో కనీసం మాట్లాడేందుకు కూ డా ఇష్టపడలేదు. గాంధీభవన్లో నిరుద్యోగులకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంపుపై విజ్ఞప్తి చేసేందుకు నిరుద్యోగులు గాంధీభవన్కు వెళ్లారు.
‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఉన్న కాం గ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో చైర్మన్, మం త్రి శ్రీధర్బాబును కలిసేందుకు యత్నించారు. గాంధీభవన్ వద్ద మోహరించిన పోలీసులు నిరుద్యోగులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎన్నికలముందు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భ ర్తీ చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్, గెలిచిన తర్వాత ఇప్పుడు కనీసం కలిసేందు కు కూడా సమమయం ఇవ్వడంలేదని యువకులు మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తామని నిరుద్యోగులు హెచ్చరించారు.