Jalamandali | సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలోని పలు వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ను ఎండీ సుదర్శన్ రెడ్డి బుధవారం సందర్శించారు. కొండాపూర్, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, బంజారాహిల్స్, సోమాజిగూడ ఫిల్లింగ్ స్టేషన్స్ను పరిశీలించి ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ ట్యాంకర్ బుకింగ్, డెలివరీ టైమింగ్స్ను కచ్చితంగా లాగ్బుక్లో రాయాలన్నారు. 5 ఫిల్లింగ్ స్టేషన్స్లోని ట్యాంకర్ డెలివరీకి సంబంధించిన ఇన్ అండ్ ఔట్ లాగ్ బుక్స్ తనిఖీ చేశారు. రాత్రి సమయాల్లోనూ నీటి సరఫరా చేసి, ట్యాంకర్ల డెలివరీ సమయాన్ని తగ్గించాలని సూచించారు.