టేకులపల్లి, ఏప్రిల్ 23 : మండల పరిధిలోని బేతంపూడి సొసైటీకి చెందిన ముగ్గురు కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మర వరప్రసాద్, బొడ బాలు ఆధ్వర్యంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్కినేని శ్యామ్బాబు, ఎండీ మౌలానా, డర్మావత్ శివ, కుమ్మరి కిరణ్, జరుపుల శివ పాల్గొన్నారు.