ఖమ్మం, ఏప్రిల్ 30 : బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు ఆటో వాలాగా మారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం ఖమ్మం పాత బస్టాండుకు పోయి ప్రయాణికులు, ఆటో వాలాలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. పిలిస్తేపలుకుతా.. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆదుకుంటాను.. మీ వాడిని మీలో ఒకడిని… నన్ను ఆశీ ర్వ దిం చం డంటూ నామా వారితో మమే క మ య్యారు. చిన్న చిన్న వ్యాపా రాలు చేసుకుంటున్న రోజు వారీ కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థిం చారు. స్వయంగా ఆటో నడిపి వారితో ఏక మయ్యారు. ఆటోడ్రైవర్లు నామాను ఆత్మీయంగా పల క రించి మద్దతు తెలి పారు. కార్య క్ర మంలో డేరం గుల బ్రహ్మం, గొడ్డేటి మాధ వ రావు, వాక దాని కోటే శ్వ ర రావు, చిత్తారు సింహాద్రియాదవ్, మోరం పూడి ప్రసాద్, నామా రామా రావు, నామా భవ్యతేజ, సాయిరాం, నల్ల మోతు కోటే శ్వ ర రావు, ఆటోడ్రైవర్ల యూని యన్ నాయ కులు సందీప్, సుబ్బా రావు, వెంక టేష్, పుల్లా రావు, పాటు తాళ్లూరి హరీష్, చీకటి రాంబాబు, సరి పూడి గోపీ సందేశ్, కృష్ణప్రసాద్ పాల్గొ న్నారు.