హాంకాంగ్లో ఊరేగింపులపై కఠిన నిషేధం విధించారు. ఇలా నిషేధం విధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం. జూన్ 4 న కొవ్వొత్తి ఊరేగింపును నిర్వహించకుండా అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. చైనాలోని థియాన్మెన్ కూడలిలో ప్రజాస్వామ్య మద్దతుదారులపై హింసాత్మక చర్యలకు గుర్తుగా ఈ కొవ్వొత్తి ఊరేగింపు నిర్వహిస్తారు. పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ఆఫ్ చైనాకు మద్దతుగా హాంకాంగ్ అలయన్స్ ఈ ఊరేగింపును నిర్వహిస్తున్నది.
కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో నిర్ణీత భౌతిక దూర పరిమితులను పేర్కొంటూ ఊరేగింపుపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్ద సంఖ్యలో జనాలు ఒకచోట చేరడంపై హాంకాంగ్లో నిషేధం ఉన్నది. చాలా సంవత్సరాలుగా హాంకాంగ్, మకావోలో 1989 హింసాత్మక చర్యల జ్ఞాపకార్థం కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రజలు అనుమతి పొందారు. సెమీ అటానమస్ చైనా నగరమైన హాంకాంగ్పై తన నియంత్రణను కఠినతరం చేస్తూ ఊరేగింపులపై నిషేధం విధించారు.
ఎన్నికల చట్టాలను సవరించే బిల్లును హాంకాంగ్ శాసనసభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం, నగరం కోసం విధాన రూపకల్పనలో చైనా అనుకూల శాసనసభ్యుల సంఖ్య పెరిగింది. సాధారణ ప్రజల ఓటు హక్కును నాటకీయంగా తగ్గించింది. ప్రభుత్వ కార్యాలయ అభ్యర్థుల తనిఖీలను నిర్వహించడానికి జాతీయ భద్రతా విభాగానికి కొత్త చట్టం అధికారం ఇస్తుంది.
ఫ్రిడ్జ్, మాస్క్లతో బ్లాక్ ఫంగస్ దాడి
రోజు కోటి వ్యాక్సిన్ డోసులు ఇచ్చేందుకు సన్నాహాలు: డాక్టర్ వీకే పాల్
సంకీర్ణ ధర్మం పాటించకపోతే మద్దతు ఉపసంహరణ : ఠాక్రేకు కాంగ్రెస్ బెదిరింపు
కొవిడ్ పాజిటివ్ శిశువుకు జన్మనిచ్చిన నెగెటివ్ తల్లి
218 కోట్ల ఫండ్ అందుకున్న కూ యాప్
జూలై 5 న అమెజాన్ సీఈఓ పదవికి గుడ్బై చెప్పనున్న జెఫ్ బెజోస్
భారత్లో యాంటీబాడీ కాక్టెయిల్తో చికిత్స .. కరోనా నుంచి కోలుకున్న హర్యానా వాసి
కొవిడ్ నివారణలో ‘సెనోటైజ్’ 99 శాతం ప్రభావవంతం : గిల్లి రిగెవ్
భారత తొలి ప్రధాని నెహ్రూ కన్నుమూత.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..