జొన్న పిండి: ఒక కప్పు, బెల్లం: అర కప్పు, పల్లీలు: అర కప్పు, నెయ్యి: పావు కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్.
స్టవ్మీద పాన్పెట్టి పల్లీలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో పావుకప్పు నెయ్యి వేసి, వేడయ్యాక జొన్న పిండి జోడించి పచ్చివాసన పోయేవరకు సన్నని మంటమీద వేయించాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించిన పల్లీలు, జొన్నపిండి, బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టి ఒక ప్లేట్లో తీసుకోవాలి. పిండి మిశ్రమంలో మిగతా నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలిపి లడ్డూలు చేసుకుంటే కమ్మటి జొన్న మిఠాయి సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Popcorn | పాప్కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
నోరూరించే హలీమ్ లడ్డూలు.. కావాల్సినప్పుడు వేడి చేసుకుని లాగించేయడమే!!
millet upma recipe | జొన్న ఉప్మా తయారీ విధానం