Ayodhya Donations : అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandhir) విరాళాల చోరీ (Donation Theft) కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ (SIT) అధికారులను ఆదేశించింది. ఈ బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్ను కూడా చేర్చాలని పేర్కొన్నది. విరాళాల నిధుల మళ్లింపు, రికార్డుల తనిఖీకి ఫోరెన్సిక్ నిపుణుడి అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తంచేసింది.
ఆలయ విరాళాల వివరాలను వెబ్సైట్లో పెట్టాలన్న పిటిషనర్ విజ్ఞప్తిపై స్పందిస్తూ.. ప్రస్తుతం తమ దృష్టి అంతా దర్యాప్తుపైనే ఉందని వ్యాఖ్యానించింది. సిట్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసం ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
సిట్ అధికారులు, యూపీ పోలీసులు ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారని.. దర్యాప్తులో తేలిన విషయాలను త్వరలో ధర్మాసనం దృష్టికి తీసుకువస్తామని కోర్టుకు వివరించారు. కాగా ఈ కేసును సీబీఐ, కాగ్తో విచారణ జరిపించాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.