న్యూఢిల్లీ: ప్రముఖ ఆయిల్ కంపెనీ వేదాంత కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్తో కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మరో మలుపు తిరుగుతుందా? అంటే పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. రాజస్థాన్లోని బర్మార్ బ్లాక్లో లైసెన్స్ టైం దాటిన తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ వెలికితీసినందుకు లాభాల రూపేణా వేల డాలర్లు చెల్లించాలని కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్కు కేంద్రం రికవరీ నోటీసు జారీ చేసింది. ఎంత మొత్తం చెల్లించాలన్నది గణించాల్సి ఉందని, అయితే మిలియన్ల డాలర్ల రూపంలో ప్రభుత్వానికి కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ చెల్లించాల్సి ఉంటుందని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి చెప్పారు.
కేంద్రం జారీ చేసిన రికవరీ నోటీసుపై కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను అధ్యయనం చేస్తున్నామని, దీనిపై ఒక నిర్ణయానికి వచ్చాక తదుపరి కార్యాచరణ చేపడతాం అని చెప్పారు.
ఈ బ్లాక్లో ఆయిల్, గ్యాస్ తవ్వకానికి కేంద్ర ప్రభుత్వంతో తొలుత కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కుదుర్చుకున్న 25 ఏండ్ల అవగాహనా ఒప్పందం ప్రకారం 2020 మే 15వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత ఇదే బ్లాక్లో ఆయిల్ అండ్ గ్యాస్ వెలికి తీయడానికి కెయిర్న్ సంస్థకు ఇచ్చిన లైసెన్స్ను కేంద్రం ఎనిమిది సార్లు పొడిగించింది. కెయిర్న్ తమకు 10 ఏండ్ల పాటు లైసెన్స్ పొడిగించాలని కేంద్రాన్ని కోరింది.
తొలి ఒప్పందం గడువు ముగిసిన తర్వాత వెలికితీసిన ఆయిల్, గ్యాస్పై వచ్చే లాభాల్లో అధిక మొత్తంలో చెల్లించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయానికి ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2017 మార్చిలో ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ విధాన నిర్ణయం తీసుకున్నది.
లైసెన్స్ గడువు పొడిగించిన తర్వాత వెలికి తీసిన ముడి చమురు, గ్యాస్పై వచ్చే లాభాల్లో 10 శాతం ప్రభుత్వానికి చెల్లించాలని కేంద్రం నిర్ణయం సారాంశం. గడువు తర్వాత వెలికితీసిన ఆయిల్, గ్యాస్పై వచ్చే ఆదాయంలో లాభాలు చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టులో కెయిర్న్ సవాల్ చేసింది.
కెయిర్న్ పిటిషన్ను 2018 మేలో విచారించిన ఢిల్లీ హైకోర్ట్ సింగిల్ బెంచ్ ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనబెట్టింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను కేంద్రం డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేసింది. ఈ విషయమై గత మార్చి 26వ తేదీన ఢిల్లీ హైకోర్ట్ డివిజన్ బెంచ్ స్పష్టమైన తీర్పునిచ్చింది.
1995 మే 15 నుంచి 25 ఏండ్ల వరకు మాత్రమే కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థకు ఆయిల్, గ్యాస్ వెలికితీసే హక్కు ఉంటుందని, తర్వాత ఒప్పందాన్ని భేషరతుగా పొడిగించరాదని స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను పక్కన బెట్టింది.
ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారం కెయిర్న్ 2020 మే 15 తర్వాత వచ్చే లాభాల్లో అధిక శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రభుత్వ వాదనతో వేదాంత కెయిర్న్ విభేదించింది.
ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్జీసీకి 30 శాతం వాటా ఉంటే, కెయిర్న్కు 70 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కెయిర్న్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో సవాల్ చేసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కరోనా ఎఫెక్ట్ : బీహార్లో వారంపాటు విద్యాసంస్థల మూసివేత
కరోనా ఎఫెక్ట్ : జమ్మూకశ్మీర్లో పాఠశాలల మూసివేత
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
విద్యా రుణాలకు ఈ బ్యాంకులు బెస్ట్!
రిలయన్స్-ఫ్యూచర్ డీల్కు 6 నెలల గడువు