పట్నా : బీహార్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రభుత్వం వైరస్ కట్టడికి ఉపక్రమించింది.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్నీ పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు ఈ నెల 11 వరకు మూసివేయాలని ఆ రాష్ట్ర సంక్షోభ నిర్వహణ బృందం నిర్ణయించింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆదివారం సీఎం నితిశ్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు విద్యాసంస్థలన్నీంటిని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రజలు గుమిగూడకుండా చూడాలని అధికారులకు సూచించారు. వివాహాలు, పుట్టిన రోజు వేడుకలను పరిమిత సంఖ్యలో జరుపుకునేలా చూడాలన్నారు.
అన్ని జిల్లాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంక్షోభ నిర్వహణ బృందం అధ్యక్షుడు అరుణ్ కుమార్ సింగ్ను ఆదేశించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని కోరారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లలో జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి