Parliament | 17వ లోక్సభ చివరి సమావేశాలు (Parliament) జనవరి 31వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని (All Party Meeting) ఏర్పాటు చేసింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
ఇక లోక్సభ చివరి సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. నెల 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ను (interim budget) ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 17వ లోక్సభ గడువు జూన్ 16న ముగియనున్నది. సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్ సమావేశం కావడం ఇదే చివరిసారి.
Also Read..
Snowfall | కొత్త అందాలను సంతరించుకున్న కశ్మీర్ వ్యాలీ.. VIDEO
Skydiver | తెరుచుకోని పారాచూట్.. 29వ అంతస్తుపై నుంచి పడి స్కైడైవర్ మృతి