Google | ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ (Google)లో లేఆఫ్స్ (Lays Off) పర్వం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాందోళనల నడుమ గూగుల్ గత రెండేళ్ల కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను (Employees) తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోమారు ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలోని పలువురు ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు.
ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించలేదు. అయితే తాజా తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభావితమైన ఉద్యోగుల్లో కొంత మందిని కంపెనీ పెట్టుబడులు పెడుతున్న భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కేంద్రాలను బదిలీ చేయనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. ఇక 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకూ తమ బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పనిచేసేందుకు పలుమార్పులు చేసినట్టు అధికార ప్రతినిధి తెలిపారు.
Also Read..
Bhadrachalam | 10.30కు భద్రాచల రామయ్యకు పట్టాభిషేకం..
Lok Sabha Elections | నాలుగో విడుత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. 11 గంటల నుంచి నామినేషన్లు షురూ
Doxing | డాక్సింగ్తో మనకు తెలియకుండానే మన ప్రైవేట్ సమాచారం బజారులో..