తొగుట ఏప్రిల్ 29: బీరప్ప దయతో ప్రజలు చల్లంగా ఉండాలని దుబ్బాక ఎమ్మె ల్యే, కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపేటలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పారు. మన కొమురవెల్లి మల్లన్న పేర కేసీఆర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. నాడు కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతుల ముఖంలో సంతోషం వెల్లివిరియగా, నేడు పంటలు ఎండిపోవడంతో రైతులు బాధపడుతున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీ స్వామి, సొసైటీ వైస్చైర్మన్ యాదగిరి, మాల్లారెడ్డి, రాంరెడ్డి, కనకయ్య, వెంకట్గౌడ్, బూత్ అధ్యక్షుడు భాస్కర్, ప్రవీణ్, రాజయ్య, యాదగిరి పాల్గొన్నారు.
మిరుదొడ్డి, ఏప్రిల్ 29: ధర్మారం గ్రామంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.