బెంగళూరు : త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు బ్యాడ్ న్యూస్. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మోకాలి గాయంలో వాపు ఇంకా తగ్గలేదని, ఇప్పుడు గనుక అతడిని ఆడిస్తే అది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని సీవోఈలోని స్పోర్ట్స్ సైన్స్ టీమ్ సూచించిన నేపథ్యంలో బుమ్రా లంకతో సిరీస్ నుంచి వైదొలిగాడు.
బుమ్రా స్థానాన్ని జమ్మూకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీ భర్తీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటనేమీ చేయకపోయినా బోర్డు ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘బుమ్రా ఫిట్గా లేడు. అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా నబీకి ఆమోదముద్ర పడింది’ అని తెలిపాడు.